Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై క్రాంతి కిరణ్, తహశీల్దార్ మహేందర్, మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాల్లో టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు డీలర్‌ షాపు నందు స్టాక్‌ రికార్డులు, బిల్స్ పరిశీలించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తన డీలర్లకు విత్తనాలు పర్మిషన్‌ ఉన్న కంపెనీ నుంచి మాత్రమే తీసుకోవాలన్నారు. సీడ్‌ లైసెన్స్‌ కొనుగోలు దారులకు కనిపించే విధంగా పెట్టాలని, ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా ఉంచాలన్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేయరాదని హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే చర్యలు తప్పవన్నారు. అదే విధంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు ఎవరైనా అమ్మితే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు ఎరువుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -