– నిర్వహణ బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలదే..:
– విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,677 విద్యాసంస్థల బస్సులు ఉంటే ఇప్పటి వరకు 17,020 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 8657 బస్సులు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. 15 ఏండ్లు దాటిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగరాదన్నారు. 15 ఏండ్లు దాటిన బస్సులు విద్యార్థులను రవాణా చేస్తే సీజ్ చేసి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల వాహనాల నిర్వహణ బాధ్యత ఆయా యాజమాన్యాలదే అన్నారు. బస్సును మంచి కండిషన్లో ఉంచడంతోపాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకొని వెళ్లే వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో జిల్లా రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలతో, డ్రైవర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపైకఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES