- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నిషేధిత గంజాయి, అల్పంజో, డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వీటిపై నిగా పెట్టడం జరిగిందని ఎక్సైజ్ సీఐ ఏ.అంజిత్ రావు శుక్రవారం నవతెలంగాణకు తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 26 వైన్ షాపులు ఉన్నాయని, 20 23 డిసెంబర్ 1న ప్రారంభమైన వైన్ షాపుల గడువు ముగియనుండడంతో ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశానుసారం దరఖాస్తులను పిలిచేందుకు సన్నద్ధం అవుతుందని తెలిపారు. ప్రభుత్వ,జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ఆదేశానుసారం రిజర్వేషన్లు ,స్లాబ్లు లు , దరఖాస్తుల స్వీకరణ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
- Advertisement -