నవతెలంగాణ – కంఠేశ్వర్ : జులై 9న బీడీ పరిశ్రమను బంద్ చేయాలని డిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకో వస్తున్న కార్మిక వ్యతిరేక చట్టానికికు వ్యతిరేకంగా జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్ నెలసరి ఉద్యోగులు, టేకేదార్లు తదితరులు బీడీ పరిశ్రమ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర కమిటీ, తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాందీకి, సమ్మె, నోటీసు సోమవారం అందజేశారు.
అంతరం.. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు,యస్, సిద్దిరాములు మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తి వేయాలని, జి,యస్, టీ,ని తొలగించాలని, కొఫ్టా చట్టంను రద్దు చేయాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న , అందరికి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల జీవన భృతి ఇవ్వాలని తెలిపారు. రిట్తెడ్ అయిన బీడి కార్మికులకు రూ.9000 పెన్షన్ ఇవ్వాలని, నాలుగు కోడ్లను రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్బంగా బీడీ కార్మికులకు ఇచ్చి హమీ ప్రకారం 2014 పిబ్రవరి 28 కటాప్ తధిని తోలగించి ఎలాంటీ షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి, 4016రూ జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్ల సాదనక్తె జూలై 9న జరిగే సమ్మె ను జయప్రదం చేయాలని, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కోషదికారి ఏస్. డి,స్తెయ్యద్, తదితరులు పాల్గొన్నారు.