- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాలేజీ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. కాలేజీకి సరిగ్గా రావడం లేదని తల్లిదండ్రులను పిలిపించగా, మనస్తాపానికి గురైన విద్యార్థి కళ్యాణ్ భవనంపై నుండి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



