Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బాసర ట్రిబుల్ ఐటీలో సీటు రాలేదని విద్యార్ధిని ఆత్మహత్య

బాసర ట్రిబుల్ ఐటీలో సీటు రాలేదని విద్యార్ధిని ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
బాసర ఐఐఐటీలో సీటు రాలేదని ఓ విద్యార్థినీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు… బోథ్ మండల్ దన్నుర్ గ్రామానికి చెందిన వెంకటమ్మ  కూతురు శైలజ (15)  పదో తరగతిలో 563 మార్కులు సాధించింది.  అయితే IIIT చేయలనుకొని అప్లై చేసి జూలై 17న  కౌన్సిలింగ్ కు హాజరైంది. అయితే అందులో సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురైంది. దింతో ఆదిలాబాద్ అటెండర్స్ కాలనీలో తన బాబాయ్ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad