Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
  • వాష్ రూమ్ లో  ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని

-కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆందోళన 

  • భారీగా పోలీసు బందోబస్తు 
  • విద్యార్థి మృతిపై పలు అనుమానాలు 

నవతెలంగాణ -పరకాల 

గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పరకాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. హనుమకొండ జిల్లా పరకాల మండలం మలక్కపేట గ్రామంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పదవ తరగతి చదువుతున్న శ్రీవాణి (14) సోమవారం మధ్యాహ్నం హాస్టల్లోని వాష్ రూమ్ లో చున్నితో ఉరివేసుకొని కనబడింది. గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలపడంతో వారు చికిత్స నిమిత్తం శ్రీవాణిని పరకాల లోని సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విద్యార్థిని పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పరకాల ఏసిపి సుధీర్ బాబు, శ్రీ కాంత్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని ఆర్డీవో డాక్టర్ కే నారాయణ, తాసిల్దార్ తోట విజయలక్ష్మి ఆధ్వర్యంలో విచారణ జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పరకాల ఏసిపి సుధీర్ బాబు వివరణ కోరగా హాస్టల్లో జరిగిన ఘటనపై ఆర్డీవో, తాసిల్దార్ సమక్షంలో విచారణ జరుపుకున్నామన్నారు. గతం వద్దకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎసిపి వివరించారు.

గురుకులం వద్ద ఆందోళన…

శ్రీవాణి ఆత్మహత్య కారణమైన గురుకుల పాఠశాల ముందు శ్రీవాణి తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు తల్లిదండ్రులను గాని, బంధువులను గాని లోపలికి అనుమతించకుండా ఎలా విచారణ చేపడతారు అంటూ పోలీసులతో వాగ్వివివాదానికి దిగారు.వారికి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తోడు కావడంతో పరిస్థితులు చేయిదాటే అవకాశం ఉండడంతో గురుకుల పాఠశాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 

 విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎస్ఎఫ్ఐ

శ్రీవాణి ఆత్మహత్య వెనకాల హాస్టల్ ప్రిన్సిపాల్ తో పాటు, ఉపాధ్యాయుల పాత్రే కారణం అంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ఆరోపించారు.విద్యార్థిని మృతి పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీవాణి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేనట్లయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తో పాటు హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఆ టీచరే కారణమా..?

శ్రీవాణి ఆత్మహత్యకు సంబంధించి అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. గురుకుల పాఠశాలలోని ఓ టీచర్ శ్రీవాణిని తీవ్ర పదజాలంతో మందలించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పలువురు చర్చించుకోవడం గమనార్హం. ఎందుకు సంబంధించి పోలీసులు తమ విచారణలో సైతం ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వాసనీయ సమాచారం.

శ్రీవాణి నోట్స్ లో ఏముంది….

శ్రీవాణి ఆత్మహత్య వెనకాల అనేక అనుమానాలు వినిపిస్తూ ఉండడమే కాకుండా, ఆమె కొన్ని ప్రత్యేక నోట్స్ను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. శ్రీవాణి చనిపోయిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ రాసుకున్న నోట్స్ ను పరిసిలిస్తే తను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో చనిపోయిన తన తల్లిని ఊహించుకుంటూ తను నీ వద్దకే వద్దకే వస్తానమ్మా అంటూ నోట్స్ రాసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -