No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలి

- Advertisement -

నవతెలంగాణ-తొగుట
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచి పాఠశాలలను బలోపేతం చేయలని ఎంపీడీ వో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ వచ్చే నెలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమా న్ని విజయవంతం చేయడానికి ఎంపీడీవో కార్యా లయంలో మండల స్థాయి అధికారులతో సమావే శం నిర్వహిస్తున్నమని చెప్పారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచి పాఠశాలలను బలోపేతం చేయడానికి అధికారులందరు కృషి చేయాలన్నారు. జూన్ 6 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ సమా వేశంలో స్థానిక తాసిల్దార్ శ్రీకాంత్, మండల విద్యా ధికారి వి. నరసయ్య, ఏపిఎం శ్రీనివాస్, అర్ఐ  అశోక్ రాజ్, స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్ రమ్య, మండల సీఆర్పీలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad