– ఎస్ఎఫ్ఐ, బివిఎం, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో పుస్తకాలను అనుమతులు లేకుండా అక్రమంగా అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసి పుస్తకాల గదులను మండల విద్యాశాఖ అధికారి పుస్తకలు ఉన్న గదులను సీజ్ చేసినట్లు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బివిఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్ లు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు పాఠశాల పేరుతో ఎక్కడ కూడా పుస్తకాలు అమ్మ రాదని నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే పాఠశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ ఒక్కొక్క విద్యార్థి నుండి 10,000 నుండి 15000 రూపాలను పుస్తకాల పేరుతో తీసుకుంటున్నారన్నారు .విద్యాశాఖ అనుమతులను పట్టిచుకోకుండా యదేచ్ఛంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, టై బెల్టు లతో వేలాది రూపాయలు తీసుకొని విద్యను వ్యాపారం చేస్తున్నారన్నారు. పుస్తకాలు అమ్మడానికి ఏలాంటి పర్మిషన్ తీసుకోకుండా తప్పుడు పత్రాలు పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మండల విద్యాశాఖ కార్యాలయ అధికారి వచ్చి పాఠ్యపుస్తకాలు ఉన్న గదులను సీజ్ చేయడం జరిగిందన్నారు. అనుమతి లేకుండా గదులను తెరిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అదోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి డి ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ , రాహుల్, మణికంఠ, యోగేష్,వంశీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాల గదులను సీజ్ చేయించిన విద్యార్థి సంఘాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES