నవతెలంగాణ – అశ్వారావుపేట : విద్యార్ధుల సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలని మండల విద్యాధికారి పి.ప్రసాదరావు అన్నారు. స్థానిక దొంతికుంట ప్రాధమిక పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రార్ధనా సమయానికే పాఠశాలకు చేరుకొని ప్రార్థన జరిగే విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్ధుల సామర్ధ్యాలను, హాజరు ను రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయుల్లో పోటీతత్వం పెరగాలని, పాఠశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని విద్యార్ధులలో ఉన్నత సామర్ధ్యాలు పెంపొందించేలా కృషి చేయాలని ప్రధానోపాధ్యాయుడు విజయ్ బాబు కు సూచించారు. వీరితో పాటు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
విద్యార్ధుల సామర్ధ్యాలు పెంపొందించాలి: ఎంఈఓ ప్రసాదరావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES