- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
కృష్ణాష్టమి పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరిసా హైస్కూల్లో గురువారము కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో రెండు పాఠశాలల విద్యార్థులు గోపికలు కృష్ణ వేషధారణలతో సందడి చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని విద్యార్థులు పోటీపడి రక్తి కట్టించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కే .రామలక్ష్మి, హెడ్మాస్టర్లు సుబ్బారెడ్డి ,నరసింహారెడ్డి లు పాల్గొన్నారు.
- Advertisement -