Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షంలో తడిసి ముద్దైన విద్యార్థులు 

వర్షంలో తడిసి ముద్దైన విద్యార్థులు 

- Advertisement -
  • – వర్షంలో తడిసి ముద్దైన విద్యార్థులు 
    – మొదటి రోజే తప్పని అవస్థలు 
    – ఉదయం 11 గంటల నుంచి ఎదురుచూపులు 
    – రెండున్నర గంటలకు హాజరైన ఎమ్మెల్యే 
    – జోరువానలోనే విద్యా సంవత్సరం ప్రారంభం
    నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం 
  • అయ్యో పాపం.. విద్యార్థులు. పాఠశాల పున ప్రారంభం మొదటి జోరు వర్షంలో తడిసి ముద్దయ్యారు. జోరు వర్షంలోనే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఉదయం 10గంటలకు హాజరు కావలసిన స్థానిక శాసనసభ్యులు మధ్యాహ్నం రెండున్నర గంటలకు హాజరయారు. ఆ సమయంలో జోరు వర్షం ప్రారంభమైంది. ఆ వర్షంలోనే విద్యార్థులు తడిసి ముద్దయ్యారు. వర్షంలో తడుస్తూ అవస్థలు గురయ్యారు. వారికోసం ఏర్పాటు చేసిన టెంట్ కింద తడుస్తూనే ఉండిపోయారు. కొందరు విద్యార్థులు టెంటు కింద కూర్చొని తడుస్తున్నడంతో కుర్చీల సహాయంతో  పాఠశాల వరండాకు చేరుకున్నారు. భారీ వర్షంలోనే విద్యా సంవత్సరం మొదటి రోజును స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు. 

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఆయా నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, నోట్ బుక్కులను అందజేశారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం జిల్లా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అయితే ఉదయం 10 గంటలకు స్థానిక శాసనసభ్యులు విద్యా సంవత్సరం ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్లు సమయాన్ని కేటాయించారు. కానీ వివిధ కార్యక్రమాల బిజీ షెడ్యూలు రీత్యా ఆయన మధ్యాహ్నం రెండున్నర గంటలకు దండుమైలారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయానికి వాతావరణ మేఘావృతమై భారీ స్థాయిలో వర్షం ప్రారంభమైంది. జోరు వానలోనే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ పూర్తిగా తడిసి ముద్దయింది. టెంటు కింద కూర్చున్న విద్యార్థులు తడిసి ముద్దయ్యారు. కొందరు విద్యార్థులు తడిసి ముద్దయి తట్టుకోలేక కుర్చీలను తలపై పెట్టుకొని పాఠశాల వరండాలోకి పరుగులు తీశారు. పాఠశాలల పున ప్రారంభం మొదటి రోజే విద్యార్థులు వర్షంలో తడుస్తూ అవస్థలకు గురయ్యారు. స్థానిక శాసనసభ్యులు సమయానికి వచ్చి విద్యా సంవత్సరాలను ప్రారంభించి ఉంటే విద్యార్థులు వర్షంలో తడిసే పరిస్థితి ఉండేకపోయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -