నవతెలంగాణ – ఆర్మూర్ : రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారిచే వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నకు 12 దేశభక్తుల ఫోటోలు సోమవారం బహుకరించారు. పి జి హెచ్ఎం ఆర్ మల్లీశ్వరి అధ్యక్షతన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి 12 దేశభక్తుల ఫోటోల బహుకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ సెక్రెటరీ రాసా ఆనంద్ క్యాషియర్ పి శశిధర్ మారుతి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారిని పాఠశాల జిహెచ్ఎం పాఠశాలకు 12 దేశభక్తుల ఫోటోలను అందజేయడంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి లో అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు సాధించారని , రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఎస్ఎస్సి లో మంచి ఫలితాలను సంపాదిస్తామని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అన్నిట్లో ముందు ఉంటారని అని నైపుణ్యాలు కలిగి ఉంటారని తెలిపారు .ఈ సందర్భంగా మునుమందు పాఠశాలకు అనేక రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు దేశభక్తుల ఫోటోల బహూకరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES