Monday, June 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు లక్ష్యం ఉండాలి: ఎస్హెచ్ఓ సత్యనారాయణ

విద్యార్థులకు లక్ష్యం ఉండాలి: ఎస్హెచ్ఓ సత్యనారాయణ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: విద్యార్థులకు లక్ష్యం ఉండాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ అన్నారు. గంజాయి, మత్తు పదార్థాల పైన పెర్కిట్ లోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ లోనే సోమవారం జూనియర్ కాలేజ్ పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులకు లక్ష్యం అనేది ఉండాలని, చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిని గ్రహించి, మనకు ప్రభుత్వం ద్వారా అందించే సౌకర్యాలను వినియోగించుకుని, ప్రయోజకులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యాం, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏ. శ్రీదేవి, నలిని, షీటీం సమత, డిహెచ్ఈడబ్ల్యూ పుష్ప, స్కూల్ టీచర్స్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -