Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించాలి 

విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించాలి 

- Advertisement -

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్
: కృషితో నాస్తి దుర్బిక్షం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాదించాలని నిజామాబాదు పోలీసు కమీషనర్ పి.సాయిచైతన్య ఉద్బోదించారు. ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్  ఆద్వర్యంలో పది, ఇంటర్మీడియట్ తరగతుల్లో అత్యుత్తమ ఫలితాలు సాదించిన తెలంగాణ లోని‌ 11 జిల్లాల నుంచి వచ్చిన రెండు వందల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం నిజామాబాదు నగరంలోని బస్వా గార్డెన్స్ లో పదివేల రూపాయల చొప్పున ఎమ్మెస్సార్ సహాయత చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాదు పోలీసు కమీషనర్ పి.సాయి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యసాధనకు కష్టపడి ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్నారు. ఆర్థిక స్థితిగతుల మీద కాకుండా కష్టపడి చదివినందున ఈ రోజు ఎమ్మెస్సార్ ట్రస్టు పదివేల రూపాయల చొప్పున అందజేసిన చెక్కులకు తాము అర్హులమయ్యామనే విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని సీపీ పేర్కొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తుపదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఎం.సాంబశివారెడ్డి, డైరెక్టర్లు ధనుష్ రెడ్డి,జి.రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి,వడ్డె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -