అనుబంధాలు పుస్తకావిష్కరణ సభలో ఎస్.ఐ. శీలం లక్ష్మణ్
నవతెలంగాణ – ధర్మారం : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ధర్మారం ఎస్సై శీలం లక్ష్మ ణ్ అన్నారు. మండలం లోని నర్సింహుల పల్లి గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న మల్లె వెంకట సుప్రజ రాసిన “అనుబంధాలు” కవితా పుస్తకాన్ని ధర్మారం ఎస్.ఐ. శీలం లక్ష్మణ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటినుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌళిక వసతులు ఉన్నాయని, ఉత్తమ బోధన చేసే అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారని కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలనున్నారు. తెలుగు ఉపాధ్యాయుడు కందుకూరి భాస్కర్ ప్రోత్సాహంతో సుప్రజ రాసిన పుస్తకం చాలా బాగుందని, విద్యార్థి సుప్రజ ఇంత చిన్న వయసులోనే అద్భుతమైన కవిత్వం రాసిందని, తనను స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థులు కూడా చదువుతోపాటు తమకు ఇష్టమైన ఇతర రంగాలలో కూడా రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్ లు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఎస్. ఐ. లక్ష్మణ్ అందజేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల రవీందర్ అధ్యక్షత వహించారు పుస్తకాన్ని కవి, రచయిత అడిచర్ల సతీష్ కుమార్ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్, రమేష్, ఆంజనేయులు, పుష్పలత, శ్రీనివాస చక్రవర్తి, భాస్కర్, రాం చంద్రారెడ్డి విద్యా కమిటీ సభ్యులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES