-మండల వ్యాప్తంగా సుమారు 3500 అందిన దరఖాస్తులు
తహసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో కొనసాగిన గ్రామసభలు
నవతెలంగాణ – రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ గ్రామ సభలు తహసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మంగళవారం విజయవంతంగా పూర్తయింది. ఈనెల 3వ తేదీ నుండి 17వ తేదీ వరకు మండల వ్యాప్తంగా మండలంలో నిర్వహించిన గ్రామ సభలో సుమారు 3500 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ… భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి మరోసారి భూ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ సర్వే చేసి రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై కూడా అధికారులకు సహకరించాలని సూచించారు.
భూ సమస్యలకు చరమగీతం..
భారతి రెవెన్యూ గ్రామ సదస్సులతో గ్రామాల్లో భూ సమస్యలకు చరమగీతం పాడవచ్చని మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో రెండవ రోజు కొనసాగిన సదస్సుకు 323 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ గ్రామ సదస్సుకు వచ్చే రైతుల భూ సమస్యలను తెలుసుకొని రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను భూభారతి గ్రామ సభలతో పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ చంద్రమోహన్, సర్వేయర్ వీరస్వామి, రికార్డ్ అసిస్టెంట్ నర్సయ్య, ఓఎస్ సోమయ్య, సీనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమారి, ఏఆర్ఐ సంధ్య, జూనియర్ అసిస్టెంట్ మురళీ కృష్ణ నాయక్, స్వాతి, పద్మ, శిరీష, రికార్డ్ అసిస్టెంట్ అంకూస్, ఓ ఎస్ అవిజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.