- Advertisement -
న్యూఢిల్లీ : అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్సీఐ) నూతన చైర్మెన్గా పిడిలైట్ ఇండిస్టీస్ ఎండీ సుధాంషు ఎంపికయ్యారు. ఆ సంస్థ 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ ప్రకటనల స్వీయ నియంత్రణ సంస్థ ఎఎస్సీఐ అక్టోబర్లో 40 ఏండ్లు పూర్తి చేసుకోనున్న సందర్బంలో సుధాంషు ఎన్నిక జరగడం విశేషమని ఆ సంస్థ పేర్కొంది. ముల్లెన్లోవ్ గ్లోబల్కు చెందిన ఎస్ సుబ్రమణ్యేవ్వర్ వైస్ చైర్మెన్గా నియమితులయ్యారు. ట్రెజరర్గా పరితోష్ జోషి ఎన్నికయ్యారు.
- Advertisement -