నవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. బదోనికి జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్ ఎడమ పక్కటెముకల కింద నొప్పితో ఇబ్బంది పడ్డాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతనికి మరిన్ని స్కాన్లు నిర్వహించి, వైద్య నిపుణుల సలహా తీసుకుంటామని పేర్కొంది. సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల బదోని, బుధవారం రాజ్కోట్లో జరగనున్న రెండో వన్డేకు ముందు జట్టుతో కలవనున్నాడు. బదోని ఇప్పటివరకు 27 లిస్ట్-ఎ మ్యాచ్లలో 693 పరుగులు చేసి, 18 వికెట్లు పడగొట్టాడు.
కివీస్ తో సిరీస్కు సుందర్ దూరం… యువ ఆటగాడికి పిలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



