- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ముత్యాల సునీల్ కుమార్ పుష్పగుచ్చం అందజేశారు.
- Advertisement -