- Advertisement -
పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరిధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. మండలంలోని నాచారం,ఆన్ సాన్ పల్లి,గ్రామాల్లో తాడిచెర్ల పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లర్లు కోత విధిస్తున్నారనే ఆరోపణలు రాకుండా నిర్వాహకులు చూడాలని సూచించారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ డైరెక్టర్ దూలం సులోచన, సింగిల్ విండో డైరెక్టర్ సర్వర్ నాయక్, పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



