- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే సీఎస్తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పింది. కంచ గచ్చబౌలి భూముల్లో చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా చెప్పాలని ప్రశ్నించింది. లాంగ్ వీక్ ఎండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని అడిగింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలంది. అనంతరం తదుపరి విచారణను జులై 23కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
- Advertisement -