Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసురేందర్‌రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు : సీపీఐ(ఎం)

సురేందర్‌రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు : సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మంగళవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏఐఎఫ్‌బి జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తుచేశారు. వామపక్షాలు చేపట్టిన అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఆయన మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
సురేందర్‌రెడ్డి మృతి తీవ్రంగా కలిచివేసింది : కూనంనేని, మామిండ్ల
బండా సురేందర్‌రెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్కువ వయసులోనే అనారోగ్యానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌ రెడ్డి మృతికి సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా సంతాపం ప్రకటించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -