Friday, May 23, 2025
Homeఆటలుఇంగ్లాండ్‌కు సూర్యవంశీ, అయుశ్‌

ఇంగ్లాండ్‌కు సూర్యవంశీ, అయుశ్‌

- Advertisement -

అండర్‌-19 జట్టుకు
ఎంపికైన యువ స్టార్స్‌

ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడిన తొలి సీజన్‌లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్‌ సూర్యవంశీ, ఆయుష్‌ మాత్రెలకు ఆల్‌ ఇండియా బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అదిరే అవకాశం అందించింది. భారత సీనియర్‌ మెన్స్‌, సీనియర్స్‌ ఉమెన్స్‌, భారత్‌-ఏ మెన్స్‌ జట్టుతో పాటు టీమ్‌ ఇండియా అండర్‌-19 మెన్స్‌ టీమ్‌ సైతం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత అండర్‌-19 జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్‌ స్టార్స్‌ వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రెలకు చోటు దక్కింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడటంతో అతడి స్థానంలో వచ్చిన ఆయుష్‌.. తనదైన ఆటతీరుతో ఆ జట్టు భావి ఓపెనర్‌గా ప్రశంసలందుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో 14 ఏండ్లకే అరంగేట్రం చేయడంతో పాటు గుజరాత్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్‌నూ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ అండర్‌-19, భారత్‌ అండర్‌-19 జట్ల పోరు జూన్‌ 24 నుంచి ఆరంభం కానుండగా.. ఆయుశ్‌ మాత్రె కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
భారత అండర్‌-19 జట్టు : ఆయుశ్‌ మాత్రె (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా, మౌల్యరాజసిన్హ, రాహుల్‌ కుమార్‌, అభిగ్యాన్‌ (వైస్‌ కెప్టెన్‌), హర్వాన్ష్‌ సింగ్‌, ఆర్‌ ఎస్‌ అంబరిశ్‌, కనిష్క్‌ చౌహాన్‌, ప్రణవ్‌ రాఘవేంద్ర, మహ్మద్‌ ఎన్నాన్‌, ఆదిత్య రానా, అన్మోల్‌జిత్‌ సింగ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -