- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజి డిసిసిబి అధ్యక్షులు ఎడ్ల రాజా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, విడిసి అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు, విడిసి పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



