- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన బండి స్వామి భారీ మెజార్టీతో గెలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తన ప్రమాణస్వీకారోత్సవానికి రాయాలని స్వామి హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇందుకు మంత్రి స్వామి గెలుపై అభినందించారు. గ్రామాభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి,పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



