జిల్లా ఎస్పీ శబరీస్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేత
నవతెలంగాణ -తాడ్వాయి
మెరుగైన శాంతిభద్రతల పర్యవేక్షణ, పౌరులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు పోలీస్ శాఖ అనుసరిస్తున్న అత్యుత్తమ సేవ (17 వర్టికల్) విభాగంలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి కి, ఈ జూన్ నెలలో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. గతంలో మే నెలలో కూడా జిల్లా వ్యాప్తంగా తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ఎస్పీ ద్వారా ప్రశంసా పత్రాలు అందుకని, అభినందనలు పొందారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ప్రతిరోజు విధుల్లో మెరుగైన సేవలందిస్తారు. శాంతిభద్రత పరిరక్షణ, పౌరులకు ఉత్తమ సేవలను అందించడంలో ఆయన కృషి ఎనలేనిది. అందుకు ఆయన కృషికి గుర్తించి ములుగు జిల్లా ఎస్పీ మే, జూన్ నెలలో ఉత్తమ ఎస్ఐగా ప్రశంసా పత్రాలు అందించి అభినందించినందుకు మండల, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు, వివిధ రాజకీయ వేత్తలు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ములుగు డి.ఎస్.పి.ఎన్ రవీందర్, పస్రా సిఐ గద్ద రవీందర్ తదితరులు పాల్గొన్నారు
విధుల్లో ఉత్తమ ప్రతిభకు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కి ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES