Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోండి..

ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

మండల విద్యాధికారి ఆంధ్రయ్య 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో ఉచిత విద్యను అందిస్తుందని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యావంతులు కావాలని మండల విద్యాధికారి ఆంధ్రయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలు తెరిచేలోగానే అన్ని పుస్తకాలను అందజేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్ లు, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం, రాగి జావ అందించడం జరుగుతుందన్నారు. అధునాతన గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్లతో పాటు ఆత్మరక్షణ విషయంలో విద్యార్థినీలకు కరాటే శిక్షణ తదితర అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం  పాఠశాలలో అందుబాటులో ఉంచిందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవడానికి వారి పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. ఈ సంవత్సరం మండలంలో ప్రాథమికోన్నత, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను ముందస్తుగానే ఇస్తున్నామన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం అయిన రోజునే విద్యార్థులకు పుస్తకాలు అందజేయాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో బషీరాబాద్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు శ్రీనివాస మూర్తి, బంతిలాల్, దేవన్న, రాకేష్, రాజకిరణ్, మధుషకర్, సీఆర్పీలు బి. అంజయ్య, పి. అంజయ్య, రాజేష్, లలిత, రతన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -