మండల విద్యాధికారి చందర్
నవతెలంగాణ – నసురుల్లాబాద్ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా ఓపెన్ ఎస్ఎస్సి, ఇంటర్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు విడుదల చేయడం హర్షణీయం అని మండల విద్యాధికారి చందర్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి చందర్ మాట్లాడుతూ .. నసురుల్లాబాద్ మండల పరిధిలో గల యువతి, యువకులు బాన్సువాడ పట్టణంకు వెళ్లి ఓపెన్ స్కూల్ ,ఇంటర్ కేంద్రాలకు వెళుతున్నారని, మారుమూల గ్రామాల నుంచి బాన్సువాడ కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం మండలంకు ఓపెన్ స్కూల్, ఇంటర్ కేంద్రంను మంజూరు చేసిందన్నారు.
ప్రభుత్వ ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల కాగానే నూతనంగా ఏర్పాటు చేసిన నసురుల్లాబాద్ కేంద్రంలో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. నూతనగా ఏర్పాటు అయిన ఓపెన్ స్కూల్, ఇంటర్ కేంద్రాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మీషన్ పొందాలనుకునే వారు ఏ తరగతిదైనా ఒరిజినల్ టిసీ, పుట్టిన తేది పత్రాలు రెండు జిరాక్స్ జతలతో పాటు కులదృవీకరణ, ఆధార్ కార్డు రెండు జతల జిరాక్స్లు, రెండు ఫోటోలు తీసుకుని ధర్మారావుపేట్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అడ్మీషన్ పొందాలని కోరారు. ఓపెన్ ఇంటర్ లో చేరే వారు ఎస్ఎస్స్సీ మెమో, కుల దృవీకరణ, ఆధార్ రెండు జతల జిరాక్స్ల తోపాటు రెండు ఫోటోలు ఇవ్వాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.