రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : జులై 1న డాక్టర్స్ డే సందర్భంగా హుస్నాబాద్డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్ లో ఆయనను కలిసిన డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ఉచిత వైద్య శిబిరానికి మంత్రిని హాజరుకావాలని ఆహ్వానించారు. మంత్రి చేతుల మీదిగా ఉచిత శిబిరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని బురుజు ప్రక్కన గల రైతు బజార్ లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ శిబిరం లో 15 మంది వైద్యలు వివిధ విభాగాలకు చెందిన సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రాంత ప్రజలు వినియోగించుకోవలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా.అక్కు శ్రీనివాస్, అధ్యక్షడు డా.కోండి సప్త ఋషి, ప్రధాన కార్యదర్శి డా.రమాదేవి, కోశాధికారీ సందీప్ కుమార్,సలహా దారులు డా.ఎల్.ధర్మ నాయక్, జాగిరి తిరుపతి తదితరులు తెలిపారు..
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES