- Advertisement -
నవతెలంగాణ – ముధోల్: ప్రభుత్వ ఏర్పాటు చేసిన సన్ ప్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సద్విని చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. మండలంలోని బ్రహ్మన్ గాం గ్రామంలో గురువారం ఎఫ్.పి.ఓ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్ ప్లవర్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం సద్విని చేసుకోవాలని పేర్కొన్నారు. సన్ ప్లవర్ క్వింటాల్ కు రూ 7280 లు ఉంటుందని అన్నారు .ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ ,రైతులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -