Tuesday, June 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంతో మాట్లాడండి

సీఎంతో మాట్లాడండి

- Advertisement -

– ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
– రవాణామంత్రితో టీజీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ నేతల భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఆర్టీసీ కార్మికుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూయూ) రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఆదివారం యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, వైస్‌ చైర్మెన్‌ డీ అబ్రహం, ఉప ప్రధాన కార్యదర్శులు డీ గోపాల్‌, ఏజీఎస్‌ నగేష్‌పటేల్‌, జాయింట్‌ సెక్రటరీ కేటీ రెడ్డి, కల్చరల్‌ సెక్రటరీ వేణోగోపాల్‌, ఛాయాదేవి మినిష్టర్స్‌ క్వార్టర్స్‌ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. గత సమావేశాల నిర్ణయా లను గుర్తుచేశారు. సీఎంతో మాట్లాడి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. ఆర్టీసీ యాజమాన్యం వెల్ఫేర్‌ కమిటీల సమావేశం నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు. ఇది ఆర్టీసీ కార్మిక వర్గాన్ని, సంఘాలను రెచ్చగొట్టడమేనని మంత్రితో చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పక్రియను పూర్తి చేసి, అపాయింటెడ్‌ డే ప్రకటించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం తమ ప్రాధాన్యతల జాబితాలో ఉన్నదనీ, త్వరలోనే సీఎంతో చర్చించి, కార్మిక సంఘాలన్నింటితో ప్రత్యేకంగా భేటీ అవుతానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులను అరిగోస పెట్టారనీ, ఆనాటి సమస్యలను ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -