- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నివాసమైన ఎర్రవల్లి ఫామ్హౌస్లో ప్రమాదవశాత్తు జారి కిందపడి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మంగళవారం పరామర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ తో కలిసి వెళ్లిన తమ్మినేని రాజేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -