ఆర్థిక శాస్త్రంలో ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలు ‘లోపరహితమైన’ పోటీ అనే పూర్తి ఊహాజనితమైన భావనతో ప్రారంభిస్తాయి. సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు దీనికి భిన్నంగా ఉండే ‘స్వేచ్ఛా పోటీ’ అనే భావనను ఉపయోగిస్తారు. మార్క్స్ కూడా దీనినే వాడాడు. సమానమైన నైపుణ్యం కల పనికి సమాన వేతనం, ఏ రంగంలోనైనా సమానమైన లాభాల రేటు ఉండేదే స్వేచ్ఛా పోటీ అని వివరిస్తారు. ఇది ఆచరణలో సాధ్యం కావాలంటే కార్మికులు స్వేచ్ఛగా ఎక్కడికైనా పోగలిగిన పరిస్థితి, పెట్టుబడి కూడా ఎక్కడికైనా సంచరించగల పరిస్థితి ఉండాలి. ఈ రెండిం టికీ తోడుగా ‘సున్నా లాభాలు’ ఉన్నప్పుడు అది ‘లోపరహిత పోటీ’ అవుతుంది. ఇది సాధ్యపడాలంటే ఏ రంగంలో లాభాలు వస్తున్నాయో ఆ రంగంలోకి ఎందరైనా పెట్టుబడిదారులు అదనంగా ప్రవేశించగలిగే పరిస్థితి ఉండాలి. అలా అందరూ ప్రవేశించగానే ఆ రంగంలో లాభాలు సున్నా అయిపోతాయి. అదనంగా పెట్టుబడిదారులు ప్రవేశించగల గడం అంటే పెట్టుబడిదారీ వర్గంలోకి ఎందరైనా స్వేచ్ఛగా ప్రవేశించగల వీలు ఉండాలి. అంటే కార్మికులు కూడా పెట్టుబడిదారులుగా మారిపోయి లాభాలు వచ్చే రంగంలోకి ప్రవేశించగలగాలి. ‘లోపరహిత పోటీ’ ఉండాలంటే ‘లోపరహితమైన సామాజిక చలనం (ఒక వర్గం నుండి మరొక వర్గంలోకి- ఉదాహరణకు కార్మికవర్గం నుండి పెట్టు బడిదారీ వర్గంలోకి) ఉండాలి. మరోలా చెప్పాలంటే వర్గాలే లేని సమాజం అయివుండాలి. ప్రస్తుత స్థితిలో అది ఊహాజనితమైన స్థితే ఔతుంది. ఈ లోపరహిత పోటీకి కొన్ని ప్రశస్తమైన లక్షణాలు ఉన్నాయి. అందుచేత అటువంటి లోపరహిత పోటీ అనేదే గనుక నెలకొంటే ఆ పోటీ ఫలితంగా నిర్ణయించబడిన ధరల స్థాయి నుండి దారి తప్పడం ఎంతమాత్రమూ మంచిది కాదు.
అయితే కొత్త అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను రూపొందించేటప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో) ప్రపంచంలో లోపరహిత పోటీ నెలకొని ఉంది అన్న ఊహాజనితమైన నిర్ధారణతో ప్రారంభించింది. అప్పటికి ఉన్న ధరల నుండి దారి మళ్లడాన్ని ఎంతమాత్రమూ అనుమతించకూడదని ఆదేశించింది. ఏ దేశంలోనైనా సరుకులను ఉత్పత్తి చేసే వారికి గనుక మద్దతు ధరలను గ్యారంటీ చేస్తే అది లోపరహిత పోటీ ఉన్న వాణిజ్యాన్ని దారి మళ్ళిస్తుంది కనుక అటువంటి మద్దతును ఏ దేశమూ అందించ కూడదని ఆదేశించింది. అదే సమయంలో అదే ఉత్పత్తిదారులకు నగదు బదిలీ వంటి రూపాలలో మద్దతును అందిస్తే అది లోపరహిత పోటీని ఏ విధంగానూ ప్రభావితం చేయదని చెప్తూ అటువంటి నగదు బదిలీలను మాత్రం అనుమతించింది.
ఈ విధమైన నిబంధన పూర్తిగా అర్ధరహితం. ఈనాటి వాస్తవిక ప్రపంచంలో గుత్త పెట్టుబడిదారుల లాభా లను నియంత్రించాలంటే వారు ఆర్జించే లాభాల రేటు మీద పరిమితులను విధించి అమలు చేయాలి. ఆ విధంగా గుత్త పెట్టుబడిదారుల లాభాల మీద నియంత్రణ అమలు చేయడం డబ్ల్యుటివో దృష్టిలో సరుకుల ధరలను, వాణిజ్యాన్ని దెబ్బ తీసే వ్యవహారంగా పరిగణించబడుతోంది. ఆ పేరుతో గుత్త పెట్టుబడిదారుల మీద ఎటువంటి నియంత్రణలనూ అది అనుమతించదు. ప్రస్తుతం ప్రపంచంలో ‘లోపరహిత పోటీ’ నెలకొని వుందన్న అర్ధం లేని ప్రాతిపదిక మీద డబ్ల్యు.టి.వో వ్యవహరిస్తోంది. ఈ పేరుతో అనేక మూడవ ప్రపంచ దేశాల మీద తన నిబంధనలను రుద్దుతోంది.ఆ దేశాలకు వాస్తవం ఏమిటో తెలిసినా, వాటిని బెదిరించడంతో అవి ప్రశ్నించలేని స్థితిలో తలొగ్గు తున్నాయి. ఈ నిబంధనల పర్యవసానంగా చిన్నరైతుల వ్యవసాయం ప్రమాదంలో పడుతోంది.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ రైతులకు చాలా భారీ మొత్తంలో సబ్సిడీలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సబ్సిడీలు రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించే రూపంలో కాకుండా నేరుగా నగదును బదిలీచేసే పద్ధతిలో రైతులకు అందుతున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలలో, అమె రికాలో రైతులకు అందించే నగదు వాళ్లు పండించే పంట ధరలో దాదాపు సగం మేరకు ఉంటుంది. జపాన్లోనైతే దాదాపు రైతు ఉత్పత్తి చేసే పంట మొత్తం విలువ ఎంతో అంత నగదు బదిలీ వారికి చేస్తున్నారు. ఇంతింత భారీ సబ్సిడీలు ఇవ్వడాన్ని డబ్ల్యు.టి.వో తప్పు పట్టదు. ఆ విధమైన నగదు బదిలీలు వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయంపై ఎటువంటి ప్రభావాన్నీ చూపబోవు అన్నది దాని వాదన.
కాని ఇండియా వంటి దేశాల్లో ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇస్తుంది. అంటే రైతుల పంటల ధరలు ఒకానొక స్థాయికన్నా దిగువకు పడిపోకుండా తానే ఆ పంటలను ప్రకటించిన ధరకు కొనుగోలు చేస్తుంది. లేదా తాను ప్రకటించిన ధరకే కొనుగోలు చేయాలని ఆదేశిస్తుంది. ఇటువంటి మద్దతు విధానాన్ని డబ్ల్యు.టి.వో అభ్యంతర పెడు తుంది. ఇది ప్రభుత్వం ధరల నిర్ణయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడమేనంటుంది. కావాలంటే భారతదేశంలో కూడా అమెరికాలో మాదిరిగా రైతులకు నేరుగా నగదు బదిలీ చేసుకోవచ్చును తప్ప మార్కెట్ ధర ఎంత ఉండాలో నిర్ణయించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అంటుంది. సిద్ధాంతంగా చూస్తే డబ్ల్యు.టి.వో వాదనలో తప్పు లేదు. కాని ఆచరణలో చూస్తే అమెరికాలో కొన్ని వేలమంది మాత్రమే రైతులు ఉన్నారు. కాని భారతదేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు, ప్రతీ రైతు ఇంటికీ నేరుగా నగదు ను అందించడం ఆచరణలో సాధ్యమయే ది కాదు. కనీస గిట్టుబాటు ధర అమలయేలా చూడడమే ఆచరణలో సాధ్యపడుతుంది. ఇటువంటి మద్దతు ధర విధానాన్ని వ్యతిరేకించడం అంటే సారాంశంలో ఇండియా వంటి దేశాల్లో రైతాంగానికి ప్రభుత్వ మద్దతు ఏ రూపానా లేకుండా చేయడమే.
వాణిజ్య పంటలను పండించే రైతుల విషయంలో ఇప్పటికే జరిగింది ఇదే. గతంలో కాఫీ, రబ్బరు, కొబ్బరి తదితర పంటలను పండించే రైతుల ప్రయోజనాల రక్షణ కోసం కాఫీ బోర్డు, కాయిర్ బోర్డు, టీ బోర్డు, రబ్బరు బోర్డు వగైరా సంస్థలను ప్రభుత్వం ఏర్పరచింది. ఇది నయా ఉదారవాద విధానాలు ప్రవేశించక మునుపు పరిస్థితి. ఆ కాలంలో ఈ వాణిజ్య పంటల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పతనమైతే ఈ బోర్డులు రంగంలోకి దిగి ఆ సరు కులను ప్రకటించిన ధరలకు కొనుగోలు చేసేవి. వాటిపై సుంకాల రేట్లను కూడా అందుకు అనుగుణంగా సవ రించేవి. కాని నయా ఉదారవాద విధానాలు వచ్చాక ఆ బోర్డులన్నీ రద్దయ్యాయి. వాణిజ్య పంటలకు ఇప్పుడు ఏ విధంగానూ ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదు. రక్షణ కరువైనందువల్ల అనేకమంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. స్వతంత్ర భారత దేశంలో నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలయ్యే వరకూ రైతుల ఆత్మహత్యల ఉదంతాలు మనం వినలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆహార పంటలకు కూడా మద్దత్తు ధర విధానాన్ని నిలుపు చేయాలని భావిస్తోంది. గతంలో తెచ్చిన నల్ల చట్టాల సారాంశమిదే. కాని రైతాంగం ప్రతిఘటనతో ఈ విషయంలో ముందడుగు వేసే ధైర్యం ఇంతవరకూ చేయడలేకపోతున్నది. కాని ప్రభుత్వం మద్దతు ధర విధానాన్ని రద్దు చేసే ఆలోచనను మాత్రం విడనాడలేదు.
ఇప్పుడు ట్రంప్ ముందుకు తెచ్చిన సుంకాల విధానంతో ఈ సమస్య తక్షణ ఎజెండాగా మారింది. ట్రంప్ ఇండియాపై విధించిన అధిక సుంకాలకు జవాబుగా ఇండియా కూడా అమెరికా మీద అధిక సుంకాలను విధించి వుంటే దేశంలోని రైతులకు పెద్ద సమస్య ఉండేది కాదు. కాని ఇండియా ట్రంప్ ప్రభుత్వంతో సంప్రదింపులకు అంగీ కరించింది. అంటే అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల మీద ఇప్పుడున్న సుంకాలను తగ్గించడానికి సూత్ర ప్రాయంగా ఒప్పుకున్నట్టే. అప్పుడు రైతుల వ్యవసాయో త్పత్తులకు ఇప్పుడు ఉన్న రక్షణ ఇక ముందు కాలంలో ఉండదు. భారీ ప్రభుత్వ నగదు బదిలీ అండతో అమెరికన్ రైతులు తమ ఉత్పత్తులను మన దేశానికి తెచ్చి ఇక్కడ చాలా తక్కువ రేట్లకు అమ్మగలుగుతారు. ఆ స్థాయికి మన రైతులూ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధి సాధించింది. దాంతో అమె రికన్ ధాన్యాన్ని కొనుగోలు చేయనవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచీ అమెరికా ఎలాగైనా మన దేశానికి తన ఆహార ధాన్యాలను ఎగుమతి చేయాలని కలలు కంటూనే వుంది. ఇండియా వంటి అతి పెద్ద ఆహారధాన్య మార్కెట్ మరెక్కడ ఉంటుంది? ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమెరికాతో సంప్రదింపులకు అంగీకరించిన కారణంగా అమెరికా కల నెరవేర్చుకునే అవకాశం వచ్చింది.
అదే గనుక జరిగితే అది భారతీయ రైతులను సర్వనాశనం చేస్తుంది. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయి వారి ఆత్మహత్యలు పెరుగుతాయి. బతికిఉన్నవాళ్లు కూడా దుర్భర దారిద్య్రంలోకి జారిపోతారు. మరో పక్క మన దేశం సాధించుకున్న ఆహార భద్రత దెబ్బ తింటుంది. ఆహార ధాన్యాల దిగుమతులకు భవిష్యత్తు లో మనం అమెరికా దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. దానిని అడ్డం పెట్టుకుని అమెరికన్ పాలకులు మన దేశ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకునే వీలు ఏర్పడుతుంది. అమెరికన్ ఆహారధాన్యాల దిగుమతుల పోటీకి తట్టుకోలేని మన రైతులు ఇతర పంటల సాగువైపు చూస్తారు. ఎప్పుడు ఏ పంటకు రేటు బాగుంటే ఆ పంటల వైపు మళ్లుతారు. అప్పుడు అనివార్యంగా ఆ పంటల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతాయి.రైతులు కోలు కోలేని స్థితిలో పడిపోతారు. మరోవైపు ఆహార ధాన్యాలను అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడానికి మనదేశానికి విదేశీ మారక ద్రవ్యం చాలా అవసరం పడుతుంది. దాంతో వాటి ధరలు దేశీయంగా పెరుగుతాయి. వాటిని కొనుక్కోలేని స్థితిలోకి ప్రజానీకం నెట్టబడతారు. ఎలా చూసినా దేశం మళ్లీ కరువు కోరల్లో ఇరుక్కుపోతుంది.
ఆఫ్రికా దేశాల్లో జరిగిందిదే. చాలా ఆఫ్రికన్ దేశాలు ఆహార పంటల సాగునుండి పక్కకువ మళ్లీ వాటిని దిగు మతి చేసుకోవడం ప్రారంభించారు. వారు ఎగుమతి చేసే వాణిజ్య పంటల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పు డెప్పుడు పడిపోయాయో, అప్పుడల్లా ఆ దేశాలు కరువుకోరల్లో చిక్కుకుపోయాయి. ఇటువంటి కరువును ఆర్థికవేత్త అమియా కుమార్ బాగ్చీ ‘ప్రపంచీకరణ కరువు’ అని అన్నారు. ఆ ప్రపంచీకరణ వల్లే రైతులు ఆహార ధాన్యాల సాగు ను విడిచిపెట్టారు కనుకనే వారి కరువుకు కారణం ప్రపంచీకరణ అని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండియా కూడా ఆ ఆఫ్రికా దేశాల సరసన చేరిపోయే ప్రమాదం ఉంది. విచిత్రం ఏమంటే ఇప్పుడు ట్రంప్ ప్రపంచీకరణ విధానం నుండి తన దేశాన్ని విడగొట్టుకోవాలని చూస్తున్నాడు. అటువంటి సమయంలో ఆ ప్రపంచీకరణ విధానాలే మన దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నాయి.
తాము అమెరికాతో జరిపే సంప్రదింపులలో రైతుల ప్రయోజనాలకు ఏ ఇబ్బందీ కలుగనియ్యబోము అని ప్రభుత్వం ప్రకటన అయితే చస్తుంది. కాని అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల మీద ఇప్పుడున్న సుంకాలను ఏ మాత్రం తగ్గించినా, దాని వలన మన రైతులు దెబ్బ తినిపోవడం ఖాయం. ఇప్పుడు సుంకాల విషయంలో అమెరికాతో చర్చలకు అంగీకరించడమే మనకు హానికరం. అమెరికాకు మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చాలా తక్కువ. కాని అమెరికన్ ఉత్పత్తులపై మనం గనుక సుంకాలను తగ్గిస్తే అది కేవలం మనదేశంలోని గుత్త పెట్టుబడిదారులకు లాభాన్ని అందించవచ్చేమో గాని రైతాంగం మాత్రం తీవ్రమైన ఇక్కట్లపాలౌతుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
సుంకాల సంప్రదింపులు – రైతాంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES