- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీనియర్ నాయకులు ఆలపాటి రామ్మోహన్ రావు (రాము) ని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం పరామర్శించారు. వయోభారంతో కూడిన అనారోగ్యం తో చికిత్స పొందుతూ గత కొన్ని రోజులుగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను తాటి వెంకటేశ్వర్లు పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.ఆయన వెంట మండల పరిషత్ మాజీ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి,కాసాని చంద్రమోహన్,ములకలపల్లి మండలం తాళ్ళపాయ మాజీ సర్పంచ్ బైటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



