- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి SMలో రీల్స్ చేసిన టీచర్ పై అధికారులు వేటు వేశారు. ఖమ్మం(D) మామిళ్లగూడెం హైస్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమి.. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిందిపోయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన SM ఫాలోయింగ్ను ఉపయోగించుకుని ప్రైవేట్ విద్యాసంస్థలు, వివిధ వ్యాపార సంస్థలకు కూడా ఆమె ప్రమోషన్స్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
- Advertisement -



