– రాష్ట్ర పరిశీలకులు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి
నవతెలంగాణ – ములుగు/గోవిందరావుపేట
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని రాష్ట్ర పరిశీలకులు ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. ములుగు జిల్లాలోని జవహర్నగర్ మోడల్ స్కూల్, చల్వాయి మోడల్ స్కూల్, చల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రెండవ దశ ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని 2025-26 విద్యా సంవత్సరంలో బడిబాట ద్వారా విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకం పెంచడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించాలనే భరోసా కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని, కోర్స్ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, సెంటర్ ఇన్చార్జిలు ఈ. సూర్యనారాయణ, అర్షం రాజు, గుల్లపెల్లి సాంబయ్య, అప్పని జయదేవ్, మండల విద్యాశాఖ అధికారులు గొంది దివాకర్, రేగ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలబలోపేతంలోఉపాధ్యాయులదే కీలక పాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES