- Advertisement -
– ఎన్నికల కమిషన్కు టీపీటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని టీపీటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ను టీపీటీయూ అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యర్శి ఎ సారయ్య కలిసి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తూ, ఓటు హక్కు కలిగి, ఇతర గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటు వేసే అవకాశాన్ని, వారికి ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేయాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
- Advertisement -


