- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని దుర్గాభవాని తండా గ్రామంలో ఘనంగా తీజ్ వేడుకను నిర్వహించారు. గురువారం గూగులోతు దేవేందర్, గుగులోతు బీచ్య, గుగులోతు ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పాడి పంటలు పండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల మురళి, నిదానపల్లి ప్రవీణ్, దర్శనం ప్రశాంత్, తండావాసులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -