నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ఆరో రోజు తీజ్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు సాగర్ నాయక్ మాట్లాడుతూ బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు తీజ్ పండుగ గొప్ప ఆలోచనలు ప్రతీక అని అన్నారు.యూనివర్సిటీ పూర్వ నాయకులు రవీందర్ నాయక్ మాట్లాడుతూ వివిధ తండాల్లో జగదంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆలయాలో గోధుమ బుట్టలు తొమ్మిది రోజులపాటు యువతులు తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారని వివరించారు. యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు సమాజంలో అందరికీ మంచి జరగాలని అదేవిధంగా తాండాలలో పంటలు బాగా పండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంజారా యువతులు సంధ్య, అశ్విని, సచిన్, మోహన్, రాము, యువ రైటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
టియూలో కొనసాగుతున్న తీజ్ ఉత్సవాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES