సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో యువతకు శిక్షణ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ‘గా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హౌల్డింగ్స్ ప్రతినిధులతో ఆయన బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పెట్టు బడులు పెట్టేందుకు వచ్చిన ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థకు పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం లోని 10వేల మంది యువతకు శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలని సమావేశానికి హాజరైన మలేషియాకు చెందిన దిగ్గజ సంస్థ స్ప్రింగ్ సెమీ కండక్టర్స్ సీఈవో కెన్కూను కోరారు. తెలంగాణ సర్కార్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన స్థానిక యువతకు సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కరిక్యులమ్ను రూపొందిస్తామని చెప్పారు. స్థానిక విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలు ఇక్కడ శిక్షణ… మిగిలిన కాలం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ కన్సల్ట్ చైర్మెన్ సందీప్ కుమార్ మక్తాలా, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మలేషియా విభాగం ప్రెసిడెంట్ మారుతి, మహేష్ నటరాజ్, వాకిటి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES