- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, సంప్రదాయానికి భిన్నంగా మేడారంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి పథకాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -



