- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. అలాగే, రైతు బంధు నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -



