- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధక్ష్యతన ఇవాళ క్యాబినెట్ కీలక భేటీ జరగనుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్ట సవరణపై చర్చ, తల్లిదండ్రులను సరిగ్గా చూడని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత, హేట్ స్పీచ్ కట్టడికి ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. డిజిటల్ మీడియా నియంత్రణ, సోషల్ మీడియా గైడ్లైన్స్పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. TVVPని డైరెక్టరేట్గా మార్చే బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా వంట గ్యాస్ సబ్సిడీ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణలు, ఇతర ఆర్డినెన్స్లపై చర్చించనున్నారు.
- Advertisement -



