Wednesday, June 25, 2025
E-PAPER
Homeఖమ్మంఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు...

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు…

- Advertisement -

హాజరైన తాజా మాజీ ఎమ్మెల్యేలు జారే, మెచ్చాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట కాంగ్రెస్ – టీఆర్ఎస్ శ్రేణులు వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే జారే ఆది నా‍రాయణ,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అధికారిక కార్యాలయం అయిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జారే ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు.అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు లో అశ్వారావుపేట ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్ లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ఆద్వర్యంలో… మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల టీఆర్ఎస్ హయాంలో నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అనంతరం టీఆర్ఎస్ గులాబీ పతాకాన్ని ఎగురవేశారు.చివరిగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ భీం రావ్ అంబేద్కర్,తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, విగ్రహాల కు పూలదండలు వేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిమ్మ చీకట్లో ఒంటరిగా బయల్దేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని అన్నారు.సాధించుకున్న తెలంగాణను బంగారు  తెలంగాణగా తీర్చిదిద్దే దిశగా  అడుగులు వేస్తూ 10 సం.లు పరిపాలించారు అని,పదేళ్ల పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని…మాయ మాటలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని  సర్వనాశనం చేస్తుందని… ప్రతి ఒకరిని రోడ్డుకు  లాగేస్తుంది అని,అందాల పోటీలకు  ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలో  ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదని ఎద్దేవా చేసారు.బీఆర్ఎస్ పరిపాలనలో దేశానికే రోల్ మోడల్ గా ఉన్న తెలంగాణ నేడు ఈ చేత కాని కాంగ్రెస్ పాలనలో నవ్వుల పాలవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా గులాబీ జెండా మాత్రమే శ్రీరామ రక్ష అని,3సం.లో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారం లోకి రావడం ముఖ్యమంత్రి గా కేసీఆర్ చూడడం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యుఎస్.ప్రకాష్ రావు, బీఆర్ఎస్ మండల అద్యక్షులు జుజ్జూరపు వెంకన్న బాబు,మండల పరిషత్ మాజీ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి,మాజీ ఉపాధ్యక్షులు చిట్టూరి ఫణీంద్ర, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జూపల్లి రమణారావు, డాక్టర్ భూక్యా ప్రసాద్,మందపాటి రాజ్ మోహన్ రెడ్డి,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ,బిర్రం వెంకటేశ్వరరావు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక  ప్రసాద్,మాజీ సర్పంచ్ లు నారం శేఖర్,జ్యోత్స్న బాయి,కలపాల దుర్గయ్య,జుజ్జూరపు శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -