నవతెలంగాణ-హైదరాబాద్ : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గన్పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జెండా వందనం, మార్చ్ ఫాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రధానంగా హైదరాబాద్ ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో ఇంచార్జి మంత్రులు పాల్గొంటారన్నారు. ఎన్నికల కోడ్ వల్ల గతేడాది పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించలేకయినందున ఈసారి తెలంగాణ కీర్తిని ప్రతిబింబించేలా విజయోత్సవాలను ఘనంగా జరపాలన్నారు. ఈసారి రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరవుతారన్నారు. సమావేశంలో సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, రఘునందన్ రావు, హరీష్, సీవీ ఆనంద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..ముఖ్య అతిథులుగా ఎవరంటే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES