Saturday, June 7, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..మహిళలకు రూ.10 లక్షల సాయం !

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..మహిళలకు రూ.10 లక్షల సాయం !

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో మహిళా స్వయం సంఘాలకు ప్రభుత్వం భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రమాదావశాత్తు సభ్యురాలు మృతి చెందితే రూ.10 లక్షల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం చనిపోయిన 385 మంది మహిళలకు రూ. 38.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
అటు పంచాయతీరాజ్ శాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్… ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపులు చేసింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు చెల్లిస్తూ నిర్ణయం తీసుకుంది. హమ్ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -