- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై భారం పడకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, మొదట GHMC పరిధిలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ముంబై, బెంగళూరు నగరాల తరహాలోనే నీటి బిల్లు, కరెంట్ బిల్లు, ఆస్తి పన్నులకు సంబంధించి ‘కామన్ బిల్’ను తీసుకురావాలని బల్దియా నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేశారు.
- Advertisement -



