నవతెలంగాణ-హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి సతీమణి హైమావతి గెలుపోందారు.

ఎదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి గాది మల్లయ్య విజయం సాధించారు.
వైరా మున్సిపాలిటీలో పదవ వార్డ్ మెంబర్ సిపిఐ(ఎం) అభ్యర్థి కిన్నెర కృష్ణయ్య ఘన విజయం సాధించారు.

నర్సంపేట మున్సిపాలిటీలో 10 వ వార్డు కౌన్సిలర్గా సీపీఐ(ఎం) అభ్యర్థి, మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు హనుమకొండ శ్రీధర్ గెలిచారు.

హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్థి శీలం నాగమణి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ములకలపల్లి రమాదేవిపై 517 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు.

జనగామ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి బూడిద జ్యోతి గోపి 95 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు




