నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : పేద, మధ్య తరగతి, అణగారిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించడం కోసం లక్షలలో డొనేషన్ ఫీజులు అడుగుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తంను తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలిశారు. ప్రస్తుతం ఉన్న వందల కాలేజీలు అన్ని ఫీజు రియంబర్స్ కోసమేనని, అన్ని కాలేజీలలో అస్సలు స్టాపే లేదని అన్నారు. లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలను సీజ్ చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసలు తెలంగాణ వాదులు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ భువనగిరి శ్రీనివాస్ నేత, మాజీ సర్పంచ్ చుక్క స్వామి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర సభ్యులు ముల్కల సత్యనారాయణ,
తుమ్మల బిక్షపతి ముదిరాజ్,
పిన్నం సుధాకర్ ముదిరాజ్లు పాల్గొన్నారు.